IDBI JAM Recruitment 2024: Apply Now for 600 Junior Assistant Manager Posts telugu - AP JOB ALERTS


IDBI JAM Recruitment 2024 :

దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు 600 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జోన్లు: 

అహ్మదాబాద్, 

బెంగళూరు, 

చండీగఢ్, 

చెన్నై, 

కొచ్చి, 

ముంబయి, 

నాగ్‌పుర్, 

పుణె, 

పాన్ ఇండియా.


1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ జనరల్: 500 పోస్టులు

2. అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్: 100 పోస్టులు


అర్హతలు: 

- గ్రేడ్ ‘ఒ’- జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ; 

- గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ/ బీటెక్‌/ బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్‌ సైన్స్/ ఇంజినీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/ టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణత అవసరం. 

- జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. 

 - అభ్యర్థులు కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరి.


వయస్సు:

01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు. 


పే స్కేల్:

 ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: 

ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ పరీక్ష సబ్జెక్టులు: 

లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), 

ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), 

జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ (60 ప్రశ్నలు- 60 మార్కులు). 

గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.


ద‌ర‌ఖాస్తు విధానం: 

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి. 



తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: 

ఏలూరు, 

కడప, 

కాకినాడ, 

కర్నూలు, 

నెల్లూరు, 

ఒంగోలు, 

రాజమహేంద్రవరం, 

శ్రీకాకుళం, 

తిరుపతి, 

విజయవాడ/ గుంటూరు, 

విశాఖపట్నం, 

విజయనగరం, 

హైదరాబాద్, 

కరీంనగర్, 

ఖమ్మం, 

వరంగల్.


ముఖ్య తేదీలు...

ప్రకటన తేదీ: 20-11-2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తులు ప్రారంభం: 21-11-2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2024.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-11-2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2024/ జనవరి 2025.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share