PM Surya Ghar Yojana: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే జీరో కరెంట్ బిల్.. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది! - AP Job Alerts



PM Surya Ghar Yojana : 

నెల పూర్తయ్యే సరికి అందరికీ కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ సారి బిల్లు ఎంత వస్తుందోననే గుబులు చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా, ఇంట్లో కరెంట్‌తో డబ్బులు సంపాదించే చాన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసా?


ఏంటా స్కీమ్?

- గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కింద అమల్లోకి వచ్చిన ఆ స్కీమ్ పేరు పీఎం సూర్య ఘర్ యోజన.

- దీని కింద సోలార్ ప్యానెల్స్, రూఫ్స్ ఇన్‌స్టాలేషన్ కోసం సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. 

- ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్‌ను తమ ఇళ్ల మీద అమర్చుకున్న వారికి ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తోంది సర్కారు. అయితే ఈ కరెంట్‌ను కేవలం ఇంటికే వాడుకోవాల్సిన అవసరం లేదు. 

- ఇంట్లో వినియోగం పోనూ మిగిలిని విద్యుత్‌ను తిరిగి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఏ ప్యానెల్ తీసుకోవాలి?

- ప్రతి నెలా మీ ఇంట్లో ఎంత విద్యుత్‌ వాడుతున్నారనేది తెలుసుకోవాలి. 

- దాన్ని బట్టి సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనుక 150 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడుతున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్‌ను అమర్చాలి. 

- ఒకవేళ 200 నుంచి 250 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తున్నట్లయితే 2 కిలోవాట్స్ ప్యానెల్‌ తీసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లు లేదా అంతకుమించి ఉంటే 3 కిలోవాట్స్ ప్యానెల్ అమర్చాలి. 

- ఈ స్కీమ్ కింద ప్రతి ప్యానెల్ ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది.


ఎలా అమ్మాలి?

- సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే విద్యుత్‌తో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నట్లయితే ఒక పని చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో నెలవారీ విద్యుత్ వాడకం 200 యూనిట్లు ఉందనుకుందాం. 

- అందుకు తగ్గట్లు మీరు 2 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ అమర్చారు. అది 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే.. మీ ప్యానెల్‌లో ఇంకా 50 యూనిట్ల కరెంట్ మిగిలిపోయినట్లే. 

- మీ వాడకం పోనూ మిగిలిన ఈ ఎలక్ట్రిసిటీని ప్రభుత్వానికి అమ్మేయొచ్చు. ఏడాది మొత్తం మీ ఇంటి వాడకం పోనూ సోలార్ ప్యానెల్‌లో మిగిలిపోయిన విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకుంటుంది. 

- ఎన్ని యూనిట్లు అమ్మారో అంత డబ్బును నేరుగా మీ అకౌంట్‌లో వేసేస్తుంది. 

- పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా ఏడాదికి సుమారుగా రూ.15 నుంచి రూ.18 వేల వరకు సంపాదించుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఈ డాక్యుమెంట్స్​ ఉండాలి!

- ఆధార్ కార్డు

- విద్యుత్ బిల్లు

- రేషన్ కార్డు

- మొబైల్ నెంబర్

- బ్యాంకు ఖాతా పాస్ బుక్,

- ఈమెయిల్

- ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి 35 గజాల స్థలం అవసరం.


ఇలా అప్లై చేయండి!

- ముందుగా పీఎం సూర్యఘర్‌ pmsuryaghar.gov.in ) పోర్టల్‌లో పేరును రిజిస్టర్‌ చేసుకోండి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని సెలెక్ట్​ చేసుకోవాలి.

- ఆపై మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయండి.

- ఇప్పుడు కన్జ్యూమర్‌ నెంబర్‌, మొబైల్‌ నంబర్‌తో సైట్​లో లాగిన్‌ అవ్వాలి. అక్కడ 'రూఫ్‌టాప్‌ సోలార్‌' కోసం అప్లై చేసుకోవాలి.

- అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వెయిట్​ చేయాలి.

- అనుమతి వచ్చిన అనంతరం మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

- ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన అనంతరం, ఆ ప్లాంట్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం అప్లై చేసుకోవాలి.

- నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు చెక్ చేస్తారు. అలాగే పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.

- ఈ రిపోర్ట్‌ పొందిన అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. ఇలా చేస్తే 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share