AP Ration Dealers Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఏపీ రేషన్ డీలర్స్ రిక్రూట్మెంట్ 2024
- చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్లలో నియామకం
- మొత్తం 192 ఖాళీల భర్తీకి ప్రకటన
- నవంబర్ 28 దరఖాస్తులకు చివరితేది
ఖాళీ వివరాలు
రేపల్లె రెవెన్యూ డివిజన్ :
మొత్తం పోస్టులు : 49
46 సాధారణ పోస్ట్లు మరియు 3 బైపాస్ (విభజించబడిన) దుకాణాలు ఉన్నాయి .
మండలాల వారీగా ఖాళీలు:
రేపల్లెపట్నం: 8
నాగారం: 8
చుండూరు: 8
చెరుకుపల్లి : 6
నిజాంపట్నం: 5
భట్టిప్రోలు : 5
అమర్తలూరు: 3
కొల్లూరు: 3
వేమూరు: 3
చీరాల రెవెన్యూ డివిజన్ :
మొత్తం పోస్టులు : 143
10 మండలాల్లో 139 రెగ్యులర్ పోస్టులు మరియు 4 కొత్త షాపులు ఉన్నాయి .
విద్యార్హతలివే :
- ఇంటర్మీడియట్ విద్యా అర్హతగా నిర్ణయించారు.
- అభ్యర్థులు రేషన్ దుకాణం ఉన్న అదే గ్రామానికి చెందినవారై ఉండాలి.
- వీరికి ఎలాంటి పోలీసు కేసులు ఉండకూడదు.
- చదువుకుంటున్నవారు, విద్యావాలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారు, ఆశ కార్యక్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం:
- రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో సమర్పించాలి.
- నవంబర్ 28వ తేదీ లోపు దరఖాస్తును సమర్పించాలి.
- దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది.
- ఇతర వివరాల కోసం రేపల్లె, చీరాల ఆర్డీవో కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే:
●︎ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిపికెట్లు
●︎ వయస్సు ధ్రువీకరణ పత్రం
●︎ నివాస ధ్రువీకరణ పత్రం (ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా పర్వాలేదు)
●︎ మూడు పాస్పోట్ సైజ్ పోటోలు
●︎ కుల ధ్రువీకరణ పత్రం
●︎ నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
●︎ దివ్యాంగుల కేటగిరికి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 28, 2024
దరఖాస్తుల పరిశీలన : నవంబర్ 29, 2024
అర్హుల జాబితా ప్రకటన : నవంబర్ 29, 2024
ఎంపికైన వారికి రాతపరీక్ష : డిసెంబర్ 2, 2024
రాత పరీక్షల ఫలితాలు : డిసెంబర్ 3, 2024
అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల నిర్వహణ : డిసెంబర్ 5, 2024
తుది జాబితా వెల్లడి: డిసెంబర్ 6, 2024
ఎలా దరఖాస్తు చేయాలి
●︎ దరఖాస్తులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో (చీరాల లేదా రేపల్లె) స్వయంగా సమర్పించాలి .
●︎ అన్ని సంబంధిత ధృవపత్రాలు మరియు పత్రాలు దరఖాస్తు ఫారమ్తో జతచేయబడిందని నిర్ధారించుకోండి.
●︎ మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు సంప్రదించవచ్చు:
ఆర్డీఓ నేలపు రామలక్ష్మి (రేపల్లె)
ఆర్డీఓ పి.చంద్రశేఖర్ నాయుడు (చీరాల)
ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉండటానికి, నవంబర్ 28, 2024 లోపు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకోండి!